ప్రతిధ్వని: కేంద్రం కొత్తగా తెచ్చిన విద్యుత్ చట్టంతో అన్నదాతలకు లాభనష్టాల మాటేమిటి ?
కరెంటు లెక్కలతో కొత్తచిక్కులు వచ్చిపడ్డాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. మీటర్లు ఉంటేనే సాగుకు విద్యుత్.. అందుకు అంగీకారపత్రం ఇవ్వకుంటే కరెంట్ కట్ అంటున్న డిస్కంల తీరు.. ఇప్పటికే ఏపీలో వాడీవేడీగా మారింది. తెలంగాణలోనూ మోటార్లకు మీటర్ల ప్రతిపాదనలపై మల్లగుల్లాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు ఉన్న విధానం స్థానంలో కొత్తగా మీటర్లు ఎందుకు పెట్టాల్సి వస్తోంది ? సంస్కరణల సంగతి సరే..భవిష్యత్లో రైతులకు విద్యుత్ రాయితీలకు భరోసా ఉంటుందా ? కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విద్యుత్ చట్టం నిబంధనలతో దీర్ఘకాలంలో అన్నదాతలకు లాభనష్టాల మాటేమిటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.