వీడియోకు పోజులిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడు మృతి

By

Published : Nov 22, 2021, 5:20 PM IST

thumbnail

కొన్ని కొన్నిసార్లు సరదా పనులే ప్రాణాల మీదకు తెస్తుంటాయి. మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో యువకుడు పట్టాలపై రైలు వస్తుండగా వీడియో తీయమని స్నేహితుడికి చెప్పాడు. అయితే రైలు మరీ దగ్గరగా వచ్చినా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శరద్​దేవ్​ ఆలయ దర్శనానికి వెళ్లిన వీరు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మృతుడిని పంజార కలా గ్రామానికి చెందిన సంజూ చౌరేగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, అతని స్నేహితుడు, కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు సోషల్​ మీడియాలో అప్లోడ్​ చేసేందుకు స్నేహితుడితో కలిసి వీడియో తీస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.