ఫోన్​ మాట్లాడుతూ మెట్రో ట్రాక్​పై పడిన ప్రయాణికుడు.. లక్కీగా...

By

Published : Feb 6, 2022, 10:40 AM IST

thumbnail

ఓ వ్యక్తి ఫోన్​ మాట్లాడుతూ మెట్రో పట్టాలపై పడిపోయాడు. అతడ్ని సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్​ కానిస్టేబుల్ రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఘటన దిల్లీలోని షాహ్​ద్రా మెట్రోస్టేషన్​లో జరిగింది. శైలేందర్ మెహతా ప్రయాణికుడు ఫోన్​ చూసుకుంటూ ఫ్లాట్​ ఫాంపై నడుస్తున్న క్రమంలో జారి మెట్రో రైలు పట్టాలపై పడ్డాడు. దీనిని చూసిన సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్ రోథాష్ చంద్ర మెట్రో ట్రాక్‌పైకి దిగి రైలు రాకముందే ఆ ప్రయాణికుడిని ట్రాక్ నుంచి ఫ్లాట్​ ఫాంపైకి ఎక్కించారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన రోథాష్​ చంద్రను నెటిజన్లు అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.