స్టాలిన్‌ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా విద్యార్థి

By

Published : Feb 4, 2022, 11:17 PM IST

thumbnail

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టిని ఓ ఆంధ్రా విద్యార్థి ఆకర్షించాడు. స్టాలిన్‌ గురువారం ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి కారులో బయలుదేరారు. టీటీకే రోడ్డులో 'సీఎం సార్‌ హెల్ప్‌ మి' అనే ప్లకార్డు పట్టుకుని ఉన్న ఓ యువకుడు కనిపించాడు. వెంటనే కారు ఆపమని, యువకుడిని పిలిపించి స్టాలిన్‌ మాట్లాడారు. అతను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్‌.సతీశ్​ అని తెలిసింది. నీట్‌ను వ్యతిరేకిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా ప్లకార్డు పట్టుకుని నిల్చొన్నానని యువకుడు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినా నీట్‌ కారణంగా వైద్యవిద్యకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎంబీబీఎస్​ సీటు ఇప్పించాలంటూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశాడు. నీట్‌ రద్దుకు చట్టపరమైన పోరాటాలు జరుగుతున్నాయని ఆ విద్యార్థికి సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో గళం వినిపిస్తున్నట్టు కూడా తెలిపారు. నమ్మకంతో ఊరికి తిరిగి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి సూచించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.