74ఏళ్ల తర్వాత కలుసుకున్న సోదరులు- భావోద్వేగంతో కంటతడి

By

Published : Jan 13, 2022, 12:26 PM IST

thumbnail

Viral Video: 1947లో భారత్​-పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఎన్నో కుటుంబాలు వేరుపడ్డాయి. కొందరు తమ బంధుమిత్రులను కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. మరికొందరు మాత్రం తమ వారిని చేరుకోలేకపోయారు. ఆ కోవకే చెందిన ఇద్దరు సోదరులు.. 74 ఏళ్ల తర్వాత ఒకదగ్గరికి చేరారు. పాకిస్థాన్​లోని కర్తార్​పుర్ సాహిబ్ ఇందుకు వేదికైంది. ఇన్నేళ్ల అనంతరం కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.