జైలుకెళ్లొచ్చిన 'హీరోయిన్' దంపతులకు పాలాభిషేకం

By

Published : May 29, 2022, 11:09 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్ట్​ అయి, ఇటీవల విడుదల అయిన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్​ రాణా దంపతులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 36 రోజుల తర్వాత శనివారం అమరావతిలోని తన సొంత ఇంటికి చేరుకున్న ఎంపీ నవనీత్​ రాణా, రవి రాణాకు పాలాభిషేకం చేశారు స్వాభిమాన్​ పార్టీ కార్యకర్తలు, అభిమానులు. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని చెప్పగా వివాదం చెలరేగి.. ఇరువురిని అరెస్ట్​ చేసి 14రోజు రిమాండ్​కు తరలించారు. దీనిపై లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు నవనీత్​. దిల్లీలోని హనుమాన్​ ఆలయంలో చాలీసా పారాయణం చేశారు. ఈ కారణంగా.. 36 రోజులు అమరావతికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న వారికి ఘనస్వాగతం పలికారు అభిమానులు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.