వైభవంగా వనస్థలిపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణం
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. 9 రోజులపాటు బ్రహ్మోత్సవ సంరక్షణార్థం గరుఢాళ్వార్ను, దేవతలను అర్చకులు వేదమంత్రాలతో ఆవాహన చేశారు. ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గరుడ హోమం, లక్ష్మీ కుబేర హోమం, నరసింహ హోమం వంటివి నిర్వహిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ప్రవచనాలను దేవస్థానం పాలకమండలి ఏర్పాటు చేసింది. 9రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు హాజరై శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST
TAGGED:
Flag hoisting