పూరమ్​ ఉత్సవాల్లో 'గజరాజు' బీభత్సం.. భక్తులు హడల్​

By

Published : May 11, 2022, 9:40 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

Elephant Ruckus Pooram: కేరళలోని త్రిస్సూర్​లో జరుగుతున్న పూరమ్​ ఉత్సవాల్లో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. మావటి నుంచి తప్పించుకుని హల్​చల్​ చేసింది. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. అయితే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టెంపుల్​ ప్రాంగణానికి వెలుపల ఈ సంఘటన జరగటం వల్ల పెను ప్రమాదం తప్పింది. 'పూరమ్​ ఉత్సవాలను ప్రారంభించేందుకు కనిమంగళమ్​ శస్థవ్​ ఊరేగింపు కోసం మచత్​ ధర్మాన్​ అనే ఏనుగును తీసుకొచ్చారు. ఊరేగింపు మనికండనాలుకు చేరుకున్న తర్వాత ఏనుగు ఇష్టారీతిలో పరుగులు పెట్టింది. అయితే, దేనిని ధ్వంసం చేయలేదు, ఎవరీకి హాని తలపెట్టలేదు. ఆ ప్రాంతంలో తక్కువ మంది ఉండటం వల్ల సులభంగా తప్పించుకోగలిగారు. ఏనుగుల నిర్వహణ బృందం వచ్చి దానిని అదుపు చేశారు.' అని పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.