వాకింగ్​కు రాలేదని కుక్కను బైక్​కు కట్టి ఈడ్చుకెళ్లిన యజమాని

By

Published : Jan 18, 2023, 11:29 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

ఎవరైనా పెంపుడు జంతువులను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అవి చేసే అల్లరిని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. కానీ వాటిని ఇబ్బంది పెట్టరు. కానీ బిహార్​ గయాలోని ఓ వ్యక్తి మాత్రం అమానవీయంగా ప్రవర్తించాడు. తన పెంపుడు శునకం ఉదయం వాకింగ్​కు నిరాకరించడం వల్ల తీవ్ర కోపం తెచ్చుకున్నాడు యజమాని. ఆ శునకాన్ని గొలుసుతో తన బైక్​కు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. దీంతో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. శునకం రక్తపు మడుగులో నిండిపోయింది. రోడ్డుపై వెళ్తున్న సదరు వ్యక్తి వీడియో తీసి ప్రశ్నించాడు. ఈ ఘటన గయాలోని గాంధీ మైదాన్​ సమీపంలో జరిగింది. యజమానిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.