AWARENESS ON FITNESS: వరంగల్ కుర్రాడు సైకిల్​పై తిరుగుతూ ఫిట్​నెస్​పై అవగాహన పెంచేస్తున్నాడు!

author img

By

Published : Sep 12, 2021, 1:12 PM IST

Updated : Sep 12, 2021, 5:29 PM IST

AWARENESS ON FITNESS, warangal youngman cycle tour

ఫిట్​నెస్​పై అవగాహన కల్పించడానికి(AWARENESS ON FITNESS) సైకిల్ యాత్ర చేపట్టిన వరంగల్ యువకుడు... ఆదివారం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ను ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్(vinay bhaskar), వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు. కరోనాతో(corona) తన తండ్రి మరణించారని... అందుకే ఫిట్​నెస్ చాలాముఖ్యమని భావించి ఈ యాత్ర చేపట్టినట్లు రంజిత్ తెలిపారు.

వరంగల్​కు చెందిన రంజిత్ అనే యువకుడు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడానికి(AWARENESS ON FITNESS) 4,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి... నగరానికి ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్(vinay bhaskar), వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వావ్ వరంగల్ టీమ్ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. రంజిత్‌ తండ్రి గతేడాది కరోనాతో(corona) మరణించారు. దీంతో మనస్తాపానికి గురైన రంజిత్‌... కొవిడ్‌(covid) సమయంలో ఫిట్‌నెస్‌(fitness) చాలా ముఖ్యమని భావించి... దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సైకిల్‌పై వరంగల్‌ నుంచి కశ్మీర్‌, కన్యాకుమారి, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లారు. 4500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తిచేసుకుని హనుమకొండకు చేరుకోవడంతో రంజిత్ కు పలువురు అభినందలు తెలిపారు. అనంతరం నగరంలో సైకిల్ ర్యాలీ చేపట్టి ఛీప్ విప్ వినయభాస్కర్​తో కలిసి మొక్కలను నాటారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: గజ్వేల్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ'ను సక్సెస్ చేయాలి

Last Updated :Sep 12, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.