అధికారులకు అభినందనలు: ఎమ్మెల్సీ కడియం

author img

By

Published : Jan 20, 2021, 5:14 PM IST

MLC congratulate  of the success of fair ainavolu jathara

ఐనవోలు జాతర విజయవంతమవడం పట్ల ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.

అధికారులు ప్రజా ప్రతినిధుల సమష్టి కృషి వల్లే ఐనవోలు జాతర విజయవంతమైందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్​ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా కష్టకాలంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాలగకుండా చూశారని కొనియాడారు. జాతరను విజవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి: వెలుగులోకి హీరో విస్వంత్ మోసాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.