ఫ్లెక్సీ విషయంలో గొడవ.. కాంగ్రెస్‌ ఇరువర్గాల మధ్య తోపులాట

author img

By

Published : Jun 27, 2022, 7:08 PM IST

ఫ్లేక్సీ విషయంలో గొడవ.. కాంగ్రెస్‌ ఇరువర్గాల మధ్య తోపులాట

హనుమకొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొండా సుస్మితా పటేల్, ఇనుగాల వెంకట్రామి రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది.

హనుమకొండ జిల్లా పరకాలలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట..... ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలోని ఫ్లెక్సీ ఏర్పాటుపై కొండా సుస్మితా పటేల్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వెంకట్రామి రెడ్డి పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి కావడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.