హనుమకొండ జిల్లా పరకాలలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట..... ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలోని ఫ్లెక్సీ ఏర్పాటుపై కొండా సుస్మితా పటేల్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వెంకట్రామి రెడ్డి పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి కావడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి