'వందల కోట్ల విలువైన భూములను తెరాస కార్యాలయాలకు అక్రమంగా కట్టబెడుతుంది'

author img

By

Published : Jun 24, 2022, 4:53 PM IST

షర్మిల

YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల విలువైన భూములను తెరాస కార్యాలయాలకు అక్రమంగా కట్టబెడుతుందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దళితులకు, పేదవారికి పంపిణీ చేయడానికి దొరకని భూములు.. తెరాస కార్యాలయాలు నిర్మించుకోవడానికి మాత్రం దొరుకుతుందా అని ఆమె ప్రశ్నించారు.

YS Sharmila: తెలంగాణలో వందల కోట్ల విలువైన భూములను తెరాస కార్యాలయాలకు రాష్ట్రప్రభుత్వం అక్రమంగా కట్టబెడుతుందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దళితులకు, పేదవారికి పంపిణీ చేయడానికి దొరకని భూములు.. తెరాస కార్యాలయాలు నిర్మించుకోవడానికి మాత్రం దొరుకుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పొలేనిగూడెం, బేతవోలు, చెన్నారిగూడెం మీదుగా పాదయాత్ర చేపట్టారు.

బంజారాహిల్స్​లో రూ.110కోట్ల విలువైన భూమిని తెరాస కార్యాలయం కోసం కేవలం రూ.5లక్షలకు రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మందు బాంబులు తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలతో గ్రామపంచాయతీ నిర్వహణ చేయాలని ఇటీవల ఓ మంత్రి అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో తెరాస పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.

"తెరాస కార్యాలయం కోసం సీఎం కేసీఆర్ రూ.110కోట్ల భూమిని కేవలం రూ.5లక్షలకే కట్టబెట్టారు. రూ.110కోట్లు ఎక్కడ రూ.5లక్షలు ఎక్కడ. డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇవ్వడానికి స్థలాలు కన్పించవు. పేదలకు మూడు ఎకరాలు ఇవ్వడానికి భూములు కన్పించవు . ఈరోజు గ్రామపంచాయతీల నిర్వహణ కోసం సర్పంచ్​లు అప్పులు చేస్తున్నారు. మందు బాంబులు తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని గ్రామపంచాయతీ నిర్వహణ చేయాలని ఇటీవల ఓ మంత్రి అనడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ 4లక్షల కోట్లు అప్పుతెచ్చారు. మరి ఆ డబ్బులన్ని ఎక్కడికి పోయాయి." - షర్మిల వైతెపా అధ్యక్షురాలు

వందల కోట్ల విలువైన భూములను తెరాస కార్యాలయాలకు అక్రమంగా కట్టబెడుతుంది

ఇదీ చదవండి: BANDI SANJAY: 'భాజపాతోనే దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది'

'అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.