సైడ్ ఇవ్వలేదని రైతులపై దాడి.. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు

author img

By

Published : Nov 22, 2022, 4:40 PM IST

Attack on farmers

Attack on farmers: తమ ద్విచక్ర వాహనానికి సైడ్​ ఇవ్వలేదని ట్రాక్టర్​ డ్రైవర్లను కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. దాడికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Attack on farmers: సూర్యాపేట జిల్లాలో కొందరు గుర్తు తెలియని దుండగులు రైతులపై దాడి చేస్తూ రెచ్చిపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం బానోతు బాలు, మున్నా అనే ఇద్దరు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని చెరో ట్రాక్టర్​పై వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తులు సైడ్ ఎందుకు ఇవ్వలేదని ఇరువురితో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాసేపటి తరువాత ఇద్దరు రైతులు నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్​ బంక్​లో ఇంధనం నింపేందుకు రాగా.. వారినే ఫాలో అవుతూ వచ్చిన నిందితులు రైతులను తీవ్ర దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితులు వచ్చిన బైక్ ఖమ్మంలో రిజిస్ట్రేషన్​ అయినట్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై రైతులు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.