YS SHARMILA: 'నిరుద్యోగులారా.. హుజూరాబాద్​ ఉపఎన్నికలో పోటీ చేయండి'

author img

By

Published : Aug 31, 2021, 10:40 PM IST

YS SHARMILA

నిజామాబాద్​లో కేసీఆర్​ కుటుంబానికి బుద్ధి చెప్పినట్లుగానే.. హుజూరాబాద్​లోనూ చెప్పాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగులను కోరారు. హుజూరాబాద్​లో వీలైనంతమంది నిరుద్యోగులు పోటీచేయాలని సూచించారు. దళిత బంధు కోసం ప్రభుత్వ భూములు అమ్మిన కేసీఆర్​.. అందరికీ బంధు ఇవ్వడానికి తెలంగాణ అమ్మేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బానిస అయిందని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా.. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం అనంతరావుపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం గజ్వేల్ మండలం గుండన్నపల్లి వద్ద దీక్ష చేపట్టారు.

నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. ప్రాణాలు ఎంతో విలువైనవని.. మీ పక్షాన తాము పోరాటం చేస్తున్నామని వైఎస్​ షర్మిల భరోసానిచ్చారు. నిజామాబాద్​లో కేసీఆర్​ కుటుంబానికి బుద్ధి చెప్పినట్లుగానే.. హుజూరాబాద్​లోనూ చెప్పాలని.. నిరుద్యోగులంతా పోటీ చేయాలని సూచించారు. నామినేషన్లు వేసే నిరుద్యోగులు అందరికీ తాము అండగా ఉండి.. సాయం చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని.. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రాంలు పెట్టాలని.. అర్హులకు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.

దళితులకు 10 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములు అమ్మిన కేసీఆర్​.. అన్ని వర్గాలకు బంధు ఇచ్చేందుకు తెలంగాణ అమ్మేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ పిట్టకథలను తెలంగాణ ప్రజలు నమ్మరని.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​నూ పట్టించుకోవడం లేదన్నారు.

YS SHARMILA: 'నిరుద్యోగులారా.. హుజురాబాద్​ ఉపఎన్నికల్లో పోటీచేయండి'

'ఏడేళ్లుగా కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం మేం నిలబడ్డాం.. మేం పోరాటం చేస్తున్నాం.. మాతో చేతులు కలపండి. హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో నిరుద్యోగులూ పోటీచేయాలి. నిజామాబాద్​లో కేసీఆర్​ కుటుంబానికి బుద్ధిచెప్పినట్లు.. ఇక్కడా చెప్పాలి. నామినేషన్లు వేసిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటాం.'

-వైఎస్​ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు.

ఇదీచూడండి: tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.