తెలంగాణ చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది: హరీశ్‌రావు

author img

By

Published : Sep 8, 2021, 12:56 PM IST

fishes distribution in siddipet

చేపలను దిగుమతి చేసుకునే స్థితి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రులు హరీశ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పర్యటించారు. రంగనాయక సాగర్​ చెరువులో చేప, రొయ్య పిల్లలను మంత్రులు వదిలారు.

సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది రూ. 4కోట్ల 87 లక్షలతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈ మేరకు చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్​ ప్రాజెక్ట్​, సిద్దిపేట కోమటి చెరువులో చేప పిల్లలు, రొయ్య పిల్లలను మంత్రులు హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 93కోట్లతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచే శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

ఏడేళ్ల కింద చేపలను ఆంధ్రా నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. తెలంగాణ చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్​ ఉంది. ఈ ఘనత సాధించడంలో సీఎం కేసీఆర్​, మంత్రి తలసాని కృషి ఎంతో ఉంది. -హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 93కోట్లతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీని చేపడుతున్నాం. -తలసాని శ్రీనివాస్​ యాదవ్, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి

ఒకప్పుడు ఈ ప్రాంతంలో చుక్క నీరు ఉండేది కాదని మంత్రి హరీశ్​ అన్నారు. కేసీఆర్​ కృషితో ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే కనబడుతోందని కొనియాడారు. ధాన్యం, చేప, రొయ్య పిల్లల భాండాగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. నాణ్యమైన చేప, రొయ్యల పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్​ ఉందని హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ చేపలకు మంచి డిమాండ్​ ఉంది: మంత్రి హరీశ్​ రావు

ఇదీ చదవండి: Rain Effect: జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న సిరిసిల్ల.. ఇక ఈ కష్టాలు మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.