బస్సు చక్రాల కింద మహిళ.. రెండు గంటలు నరకయాతన

author img

By

Published : Sep 5, 2021, 5:48 PM IST

a woman stuck under the bus

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి మహిళల ప్రాణాలను బలితీసుకోబోయింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లా కొత్తూరు చౌరస్తాలో రోడ్డు పక్కన నిల్చున్న ఇద్దరు మహిళలపై.. బస్సు అదుపుతప్పి దూసుకురావడంతో ఓ మహిళ.. బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయింది. క్రేన్​ సహాయంతో 2 గంటల తరువాత ఆమెను కాపాడగలిగారు.

రోడ్డుపక్కన నిల్చున్న ఇద్దరు మహిళలపైకి అకస్మాత్తుగా బస్సు దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో మహిళలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇందులో ఓ మహిళ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయి రెండు గంటల పాటు అవస్థ పడింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బీ)చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బీదర్ నుంచి జహీరాబాద్ వస్తున్న బస్సు అదుపుతప్పి మహిళలపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కొత్తూరుకి చెందిన చంద్రమ్మ.. బస్సుముందు చక్రాల కింద ఇరుక్కుపోయింది. బయటకు రాలేక రెండు గంటల పాటు నరకయాతన పడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ తెప్పించి బస్సును పైకి ఎత్తించి మహిళను కాపాడారు. రహదారిపై వేగనియంత్రణ చర్యలు చేపట్టేలా చూడాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి: వద్దన్నా వినలేదు.. వాగులో కొట్టుకుపోయాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.