TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 259 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Sep 16, 2021, 8:01 PM IST

TS CORONA CASES

19:33 September 16

TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 259 కరోనా కేసులు, ఒకరు మృతి

TS CORONA CASES
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 259 కరోనా కేసులు, ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 259 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,62,785కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య  3,900కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో 301 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,603 మంది కొవిడ్​ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 క్రియాశీల కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోం ఐసోలేషన్​లో ఉన్నారు.  

రాష్ట్రంలో ఇవాళ 58,261 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్​ఎంసీలో కొత్తగా 72 కేసులు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో​ 2, భద్రాద్రి కొత్తగూడెం 8, జగిత్యాల 9, జనగామ 9, కామారెడ్డి 1,  కరీంనగర్​11, ఖమ్మం 22,  మహబూబ్​నగర్ ​2, మహబూబాబాద్​ 6, మంచిర్యాల 6, మెదక్​ 1, మేడ్చల్​ 13, కుమురం భీం ఆసిఫాబాద్ 1, నారాయణపేట 1,  నాగర్​ కర్నూల్​ 1, నల్గొండ 11, నిర్మల్​ 1, నిజామాబాద్​ 2, పెద్దపల్లి 9, రాజన్న సిరిసిల్ల 7,  రంగారెడ్డి 15, సంగారెడ్డి 4, సిద్దిపేట 6, సూర్యాపేట 6, వికారాబాద్​ 0, వనపర్తి 2, వరంగల్​ 8, హనుమకొండ 16, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, వికారాబాద్,  ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి: KTR FIRES ON REVANTH REDDY: టీపీసీసీగా రేవంత్​రెడ్డి ఎంపికపై కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.