నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనన్న కేసీఆర్

author img

By

Published : Aug 25, 2022, 5:38 PM IST

CM KCR ON MODI

CM KCR Fire On Modi దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

CM KCR Fire On Modi పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు మండే తెలంగాణా కావాలో ప్రజలే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంతో పాటు దేశం బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాల్సిన ప్రధాని మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్​ను ప్రారంభించిన సీఎం అనంతరం బహిరంగసభలో మాట్లాడారు.

ఇవాళ ఏం లొల్లి జరుగుతోంది. కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే 9 రాష్ట్రాలను కూలగొట్టారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, దిల్లీ ప్రభుత్వాలను కూలగొడతారంటా. బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఇవాళ ఏం జరుగుతోంది. ఈ ఏడాది మన హైదరాబాద్​లోనే ఎక్కువ ఉద్యోగాలొచ్చాయి. కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం. కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా మంచిపని చేసిండ్రా. ఒక్క ప్రాజెక్ట్ కట్టిండ్రా. ఏం చేసిండ్రా అని అడుగుతున్నా. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదా? దేశానికి కనీసం మంచినీళ్లు ఇవ్వలేరా? 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతూ ఉంటే మీకు సోయి లేదా?.- కేసీఆర్, సీఎం

ముఖ్యమంత్రిగా నేను ప్రధానిగా మోదీ ఒకేసారి అయ్యామని.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. స్వయంగా ప్రధానమంత్రే కుట్రలు పన్ని 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారని ఆరోపించారు. స్టాలిన్‌, కేజ్రీవాల్‌, మమత బెనర్జీ ప్రభుత్వాలను కూల్చేస్తామని మాట్లాడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యమా? అని కేసీఆర్ నిలదీశారు. మోదీ ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడికిలి బిగించి కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వ్యవస్థలను ఆగం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. బిహార్‌, దిల్లీ, బెంగాల్‌లో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను: నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వనని హెచ్చరించారు. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయన్నారు. స్వార్థ మత పిచ్చిగాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్​తో పాటు తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు.

వాటా తేల్చడం చేతకాదు: కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోదీకి చేతకాదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మోదీ.. మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతామని సీఎం అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనన్న కేసీఆర్

ఇవీ చదవండి: వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.