నేడు పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన

author img

By

Published : Aug 29, 2022, 12:03 AM IST

CM KCR tour in peddapally district

CM KCR peddapally tour నేడు పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేయనున్నారు. రూ. 48 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

CM KCR peddapally tour ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చేరుకోనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు దారిపోడువున వందలాది కార్లు ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రాహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ముఖ్యమంత్రి ఆగే అవకాశం ఉంది. దీనితో భారీ బందోబస్తుపై అధికారులు దృష్టిసారించారు. 2500 నుంచి 5000 కార్లతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు రానున్నారు. అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సముదాయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా 130 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనసమీకరణకు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.