పెద్దపల్లి కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

author img

By

Published : Aug 29, 2022, 4:10 PM IST

CM KCR peddapally tour

CM KCR peddapally tour పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభమైంది. కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

CM KCR peddapally tour ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు వచ్చారు.

అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సముదాయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా 130 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనసమీకరణకు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.