'తెలంగాణపై కేంద్రం గజనీ మహమ్మద్​లా దండయాత్ర చేస్తోంది'

author img

By

Published : Sep 18, 2022, 6:43 PM IST

Updated : Sep 18, 2022, 7:13 PM IST

ప్రశాంత్​ రెడ్డి

Prashant Reddy Fires On Central Government: తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టడం భాజపా నేతలు మానుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. భాజపా ప్రభుత్వం తెలంగాణ మీద గజనీ మహమ్మద్​ కంటే ఎక్కువగా దండెత్తుతోందని విమర్శించారు. ఇప్పటికైనా భాజపా తీరు మార్చుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.

Prashant Reddy Fires On Central Government: తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టడం భాజపా నేతలు మానుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. భాజపా తీరును ఆయన తప్పుపట్టారు. భాజపా ప్రభుత్వం తెలంగాణ మీద గజనీ మహమ్మద్ కంటే ఎక్కువగా​ దండెత్తుతోందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా దండయాత్రకు వస్తారా అని విమర్శించారు. నిజామాబాద్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా భాజపా పద్దతి మార్చుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కేంద్రంలో ఎప్పటికీ భాజపా ప్రభుత్వమే ఉండదని.. ఇది ప్రజాస్వామ్య దేశం అన్న సంగతే మర్చిపోయారా అని ప్రశ్నించారు. అదేవిధంగా హైదరాబాద్​కు వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

'తెలంగాణపై కేంద్రం గజనీ మహమ్మద్​లా దండయాత్ర చేస్తోంది'

"తెలంగాణ మీద గజనీ మహమ్మద్ కంటే ఎక్కువగా కేంద్రం దండయాత్ర చేస్తుంది. అటు కేంద్ర మంత్రుల తోటి దండయాత్ర చేపిస్తున్నారు. ఇటు గవర్నర్​ తోటి దండయాత్ర చేపిస్తున్నారు. మనం జాతీయజెండా ఎగురవేసి జాతీయతాభావాన్ని చాటి చెబుతున్నాం. అటువంటి సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్​లో కవాతు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి పోతున్నారు. దేశంలో ఎక్కడికైనా పోయారా లేక తెలంగాణకే ఎందుకు వస్తున్నారు. ఇది దేనికి సంకేతం. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు." -ప్రశాంత్ రెడ్డి మంత్రి

ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం సాహసించలేదు..: నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని అమిత్ షా అన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించ లేదని చెప్పారు.

ఇవీ చదవండి: మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?

Last Updated :Sep 18, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.