SRSP: శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

author img

By

Published : Sep 10, 2021, 4:14 PM IST

sriramsagar

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు​కు వరద కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నిజాంసాగర్ గేట్లు మూసేవేశారు. ఈ క్రమంలో 9 నెంబర్ గేట్ మొరాయించింది.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు​కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,06,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా 49,980 క్యూసెక్కుల ఔట్​​ఫ్లో ఉంది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.90 అడుగుల నీటి మట్టం ఉంది.

వరద తగ్గటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో 9 నెంబర్ గేట్ మొరాయించింది. గేటు మూసుకోకపవటంతో 3,000 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే గేట్ మొరాయించిందని తెలిపారు.

ఈ విషయమై అధికారులకు తెలిసినా.. తొమ్మిదో నెంబర్ గేట్ రిపేర్​లో ఉన్నా మళ్లీ దానిని తెరవడంతో మొరాయించినట్లు స్థానికులు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా అధికారులు తూతూ మంత్రంగానే పనిచేసి వదిలేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

SRSP: శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

ఇదీ చదవండి: Viral Video: ఇంట్లోకి పాము- బుజ్జగించి బయటకు పంపిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.