Etela: 'హుజూరాబాద్​ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం'

author img

By

Published : Sep 17, 2021, 4:05 PM IST

former minister eteal rajender

రాబోయే కాలంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. నిర్మల్​లో భాజపా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు.

రాబోయే కాలంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. నియతృత్వ పాలనకు హుజూరాబాద్​ గడ్డ ఘోరి కడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. యావత్​ తెలంగాణ ప్రజానీకం హుజూరాబాద్​ వైపు చూస్తోందని తెలిపారు. నిర్మల్​లో భాజపా తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొని... ప్రసంగించారు.

Etela: హుజూరాబాద్​ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం

హుజూరాబాద్​ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. దీన్ని ఆపగలిగే సత్తా కేసీఆర్​కు కాదూ కాదా ఆయన జేజేమ్మకు కూడా లేదు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వామ్యులు కావాలి.

-ఈటల రాజేందర్​, మాజీ మంత్రి

ఇదీ చదవండి: Petrol GST news: అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.56, డీజిల్ రూ.50!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.