నారాయణ పేట జిల్లా ఊట్కూరు చెక్పోస్ట్ దగ్గర రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలని రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని... మాయమాటలతో తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ మరోసారి అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు.
భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పీఏసీఎస్ ఛైర్మన్ బాల్రెడ్డి అక్కడకు చేరుకుని… జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: Bandi Sanjay: కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయి