farmers protest: ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతుల ధర్నా

author img

By

Published : Jun 2, 2021, 7:50 PM IST

Farmers dharna  utkoor narayanpet

వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణ పేట జిల్లా ఊట్కూరు చెక్​పోస్ట్ వద్ద రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. ఈ నేపథ్యంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణ పేట జిల్లా ఊట్కూరు చెక్​పోస్ట్ దగ్గర రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలని రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని... మాయమాటలతో తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ మరోసారి అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు.

భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పీఏసీఎస్ ఛైర్మన్ బాల్​రెడ్డి అక్కడకు చేరుకుని… జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్​ ద్వారా మాట్లాడి రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: Bandi Sanjay: కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.