Inspection: రైసుమిల్లు తనిఖీ చేసిన పౌరసరఫరాల తహసీల్దార్ 

author img

By

Published : Jun 5, 2021, 5:03 PM IST

Inspection: రైసుమిల్లు తనిఖీ చేసిన పౌరసరఫరాల తహసీల్దార్ 

రైతుల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లుకు తీసుకురావాలని పౌరసరఫరాల ఎన్​ఫోర్స్​మెంట్​ డిప్యూటీ తహసీల్దార్​ మాచన రఘునందన్​ కోరారు. నారాయణ పేట జిల్లా మరికల్ మండలం తీలేర్​లో ఉన్న రైస్ మిల్లును తనిఖీ(Inspection) చేశారు.

నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్​లో ఉన్న రైస్ మిల్లును పౌరసరఫరాల ఎన్​ఫోర్స్​మెంట్​ డిప్యూటీ తహసీల్దార్​ మాచన రఘునందన్ తనిఖీ(Inspection) చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లుకు తీసుకురావాలన్నారు. వడ్లను త్వరగా మిల్లింగ్ చేయాలని కోరారు. లెవీ బియ్యం సకాలంలో తిరిగి అప్పగించాలని స్పష్టం చేశారు.

మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో అతనితో ఫోన్​లో మాట్లాడారు. మిల్లర్లకు కేటాయించిన ధాన్యం కోటా తీసుకోవడం పూర్తయినప్పటికీ తగిన నిల్వ కోసం స్థలం ఉంటే అదనపు కోటా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా వేళ మిల్లులో పని చేసే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి ఉండాలన్నారు.

ఇదీ చదవండి: పిల్లలను కాపాడుకునేందుకు ఒక కంచెలా నిలబడాలి: సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.