Ktr Nalgonda tour: భాగ్యనగరానికి 65 టీఎంసీల నీటికుండ: కేటీఆర్

author img

By

Published : May 15, 2022, 4:52 AM IST

Ktr Nalgonda tour

Ktr Nalgonda tour: హైదరాబాద్ వాసులకు మరో 50 ఏళ్లపాటు నీటి అవసరాలు తీరేలా సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జనానికి ఏదేదో చేస్తామని ఎన్నికల ముందువచ్చి మాయమాటలు చెప్పేనేతల మాటలను నమ్మొద్దని కేటీఆర్ హెచ్చరించారు.

Ktr Nalgonda tour: ఐదేళ్లు కరవు వచ్చినా హైదరాబాద్‌కు తాగునీటికి ఇబ్బంది ఉండదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ వేయాలనుకుంటున్నామన్న కేటీఆర్ 2072 వరకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అనంతరం నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ హంగులతో ముస్తాబైన బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 274 ఎకరాల్లో దాదాపు 100 కోట్లు ఖర్చుచేసి సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. గౌతముడు నడయాడిన బుద్ధగయ, సారనాథ్, లుంబిని తదితర ప్రాంతాల్లో లేని విధంగా అన్ని ప్రతిమలను ఈ పార్కులో నెలకొల్పడం విశేషమని కొనియాడారు.

ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏమిచేయలేని వారు. ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామని అనడం హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు. రైతులకు ఏదేదో చేస్తామంటూ వచ్చే వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. నోముల భగత్‌ విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్‌ వరాలజల్లు కురిపించారు.

ఇవీ చూడండి: 'తెలంగాణకు రావాలంటే.. కల్వకుంట్ల కుటుంబం​ పర్మిషన్​ తీసుకోవాలా..?'

బాలికపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. డ్రైవర్​కు నిప్పంటించిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.