DALITHA BHERI: దళిత భేరి సభ ఏర్పాట్లు పూర్తి..

author img

By

Published : Sep 11, 2021, 6:03 PM IST

Updated : Sep 11, 2021, 7:14 PM IST

dalitha bheri

నల్గొండ జిల్లా తిరుమలగిరిలో రేపు జరగబోయే దళిత భేరి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్​టీపీ నేతలు తెలిపారు. ద‌ళితుల ప‌క్షాన తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.

రేపు వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ద‌ళిత భేరి బ‌హిరంగ సభ‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పార్టీ నేతలు తెలిపారు. నల్గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌లగిరి ప‌ట్టణంలో ఈ సభ జరగనుంది. వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ స‌భ‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద‌ళితులు, విద్యావేత్తలు, మేధావులు, నిరుద్యోగులు, పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు, వైఎస్​ఆర్​ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ద‌ళితుల‌కు జ‌రుతున్న అన్యాయాలు, వారికి కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత హామీల‌పై సమావేశంలో షర్మిల ప్రసంగించనున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి: YS SHARMILA: "ద‌ళిత భేరి" సభకు మందకృష్ణ మాదిగను ఆహ్వానించిన షర్మిల

Last Updated :Sep 11, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.