Ministers On Ramappa: 'విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం'

author img

By

Published : Aug 3, 2021, 7:47 PM IST

ministers visited ramappa temple for development as Tourism hub

రామప్ప ఆలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు కాకతీయ కళావైభవం నిర్లక్ష్యానికి గురైందన్నారు. రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ ఎంతో ఉందన్నారు. అభివృద్ధికి స్థానికులు సహా ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రామప్ప ఆలయాన్ని టూరిజం హబ్‌లా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రామప్పకు అంతర్జాతీయ గుర్పింపు లభించిన తరుణంలో... ప్రపంచ స్థాయిలోని పర్యటకులను రప్పించే విధంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సందర్శించారు. అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభివృద్ధికి సహకరించాలి..

"విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రామప్ప వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం... దేశానికే గర్వకారణం ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర విభజనకు ముందు కాకతీయ కళావైభవం నిర్లక్ష్యానికి గురైంది. రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ ఎంతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికులు సహా ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి."

- శ్రీనివాస్‌ గౌడ్‌, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి

ప్రభుత్వ కృషి ఎంతో...

"రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకురావటానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అందరి సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యపడుతుంది. రోడ్ల విస్తరణ సహా ఇతర కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధికి అందరూ సహకరించాలి."- ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

అభివృద్ధికి ప్రణాళికలు...

"రామప్పకు దక్కిన ప్రపంచస్థాయి గుర్తింపు నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అభివృద్ధికి స్థానికులు కూడా సహకరించాలని కోరారు."- సత్యవతి రాఠోడ్‌, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.