ఘోర ప్రమాదం.. మహిళ సహా ముగ్గురు మృతి

author img

By

Published : Sep 12, 2022, 10:47 AM IST

Updated : Sep 12, 2022, 2:19 PM IST

road accident in Medchal

accident in Medchal: మేడ్చల్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్​ వెళ్తున్న నవ దంపతులు మేడ్చల్​ బస్​ డిపో దగ్గర ఓ వ్యక్తిని ఢీకొని రోడ్డుపై పడిపోగా.. ఇనుము లోడుతో వెళ్తున్న లారీ వీరి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో వీరితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. మహిళ సహా ముగ్గురు మృతి

road accident in Medchal: మేడ్చల్​ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై రామాయంపేట పట్టాణానికి చెందిన నవ దంపతులు సాయిరాజ్​, సారిక సొంత ఊరు నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా మేడ్చల్ బస్​ డిపో ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొని పడిపోగా వెంటనే వెనుక నుంచి వస్తున్న ఇనుము లోడుతో వస్తున్న లారీ వీరిపై నుంచి వెళ్లడంతో అక్కడికిక్కడే వారు మృతి చెందారు. వీరు ఢీకొట్టిన వ్యక్తి బలమైన గాయాలతో అక్కడే మృతి చెందారు.

మృతులు సాయిరాజ్​, సారికకు ఈ ఎడాది మర్చిలో పెళ్లి అయ్యింది. వీరు వృత్తి రిత్యా హైదరాబాద్​లో ఉంటుండగా ఆదివారం సెలవు దినం కావటం, సొంత ఊరిలో వినాయక నిమజ్జానికి వేళ్లి ఈరోజు వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణంతో సొంత గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Sep 12, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.