‘సింగూరు కాలువ ద్వారా.. కాళేశ్వరం జలాలు అందిస్తాం’

author img

By

Published : Aug 4, 2020, 6:36 PM IST

Medak MLA Padma Devender Reddy Inaugurates development works

సాగునీరు, తాగునీరుకు సింగూరు ప్రజలు ఇబ్బంది పడకుండా త్వరలో సింగురూ కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను అందిస్తామని, నీటి కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైందని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు. మెదక్​ జిల్లాలోని నార్సింగ్​, రామాయంపేట్​, నిజాంపేట్​ మండలాల్లో ఆమె పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.

సింగూరు కాలువ ద్వారా ఆ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు అందిస్తామని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు. మెదక్​ జిల్లాలోని నార్సింగ్, రామాయంపేట్​, నిజాంపేట్​ మండలాల్లో ఆమె అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 100 శాతం డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయిందని, పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

ఆడబిడ్డలు నీటికి ఇబ్బంది పడకుండా మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేశారని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేయడం దాదాపు పూర్తయిందని అన్నారు. నిజాంపేట మండలంలో 19వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. రైతుల క్షేమం కోరి.. ముఖ్యమంత్రి కేసీఆర్​ నియంత్రిత వ్యవసాయ విధానం, రైతు వేదిక అనే కొత్త పద్ధతులను తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.