కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్‌ విడుదల

author img

By

Published : Dec 24, 2020, 5:45 PM IST

masaipet as a new mandal in medak district

మెదక్‌ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మెదక్ జిల్లాలో కొత్త మండలం ఏర్పాటైంది. తొమ్మిది గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. చేగుంట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, రామాంతపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు.

తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మాసాయిపేటను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. తుది నోటిఫికేషన్‌కు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: వ్యాక్సిన్ ఆవిష్కరణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.