2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్(congress) అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore) స్పష్టం చేశారు. మొత్తం 78 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ బ్లాక్, మండల అధ్యక్షుల సమావేశానికి మాణిక్కం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అందుకే అమిత్ షాను కలుస్తున్నారు..
తెరాస పాలనలో బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం అయిందని మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore) ఎద్దేవా చేశారు. తెరాస దుకాణం బంద్ అయ్యే రోజులొచ్చాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రాజెక్టులో మంత్రి కేటీఆర్ 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. కేసీఆర్ దిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసి ఆయన మీద కేసులు రాకుండా చూసుకుంటున్నారని మాణిక్కం(Manikkam Tagore) ఎద్దేవా చేశారు.
టైం స్టార్ట్ అయింది..
క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore) పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయీ సమేవేశాలు ప్రారంభించామని చెప్పారు. పార్టీ క్యాడర్ చాలా పెద్దదని.. కాంగ్రెస్కు మంచి రోజులొచ్చాయని వివరించారు.
ఇదీ చదవండి: KTR speech latest: 'సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు పరిశ్రమలు తీసుకెళ్తే ఓరుస్తలేరు'