రైల్వే అండర్​పాస్​లోకి చేరిన వరద నీరు.. హైవేపై భారీగా ట్రాఫిక్​జామ్​

author img

By

Published : Jul 23, 2022, 3:47 PM IST

రైల్వే అండర్ పాస్

మెదక్ జిల్లాలోని రైల్వే అండర్ పాస్​లోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అక్కడికి చేరుకొని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపివేస్తున్నారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్​లోకి పూర్తిగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో రెండు వాహనాలు అందులో చిక్కుకున్నాయి. దీంతో హైదరాబాద్ నాగపూర్ ఎన్​హెచ్​44 జాతీయ రహదారిపై తెల్లవారుజాము నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా రహదారి ఇరువైపులా 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​ ఏర్పడింది. హైవే సిబ్బంది 8భారీ మోటార్లతో నీటిని బయటకు పంపివేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది, ప్రత్యామ్నాయ మార్గాల గుండా వాహనాలను మళ్లిస్తున్నారు.

రైల్వే అండర్​పాస్​లోకి చేరిన వరద నీరు.. హైవేపై భారీగా ట్రాఫిక్​జామ్​
ఇవీ చదవండి: జంట జలాశయాలు, హుస్సేన్​సాగర్​కు భారీగా వరద.. భయం గుప్పిట్లో ప్రజలు..

రైల్వే స్టేషన్​లో సామూహిక అత్యాచారం.. అక్కడి ఉద్యోగుల పనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.