BJP: తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే: బండి సంజయ్‌

author img

By

Published : Sep 14, 2021, 5:54 PM IST

bandi sanjay

తెరాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. మెదక్‌లో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే కలుస్తాయని చెప్పారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర మెదక్​కు చేరింది. తెరాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని సంజయ్​ తేల్చి చెప్పారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే కలుస్తాయన్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఉద్యోగాల గురించి చెబుతారని ఎద్దేవా చేశారు. 3 లక్షల ఇళ్ల కోసం కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. దేశంలో 135 కోట్ల మందికి ఉచితంగా టీకాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఈ హత్యలకు సీఎం కారణమని ఆరోపించారు. వరి ఎస్తే ఉరే అని సీఎం కేసీఆర్​ అనటంతో ఐదురుగు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు.

భాజపా, తెరాస ఎప్పుడైనా కలిసి పోటీ చేశాయా. కానీ తెరాస, కాంగ్రెస్​ కలిసి పోటీ చేశాయి. తెరాస, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. తెదేపా, తెరాస కలిసి పోటీ చేశాయి తప్ప భాజపా, తెరాస ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదు. కాంగ్రెస్​లో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలోకి పోయారు. కానీ భాజపాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు గులాబీ పార్టీలోకి పోలేదు. భాజపా, తెరాస ఒక్కటి అంటే దుబ్బాకలో రఘునందన్​ రావు ఎలా గెలుస్తారు..? జీహెచ్​ఎంసీలో ఎలా గెలుస్తాం..? వరంగల్​ కార్పొరేషన్​లో ఒక్క స్థానం భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో ఏ విధంగా గెలుస్తాం.? భాజపాను ఏదో విధంగా అప్రదిష్టపాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్​ ప్రయత్నం చేస్తున్నాయి.

-బండి సంజయ్,​ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

BJP: తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే: బండి సంజయ్‌

ఇదీ చదవండి: గణేశ్​ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.