వాగులో చిక్కుకున్న యువకులు... కాపాడిన పోలీసులు

author img

By

Published : Jul 22, 2021, 7:22 PM IST

Updated : Jul 22, 2021, 10:13 PM IST

missing

19:19 July 22

వాగులో చిక్కుకున్న యువకులు... కాపాడిన పోలీసులు

చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులు...

మంచిర్యాల జిల్లా సల్పలవాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురిని పోలీసులు రక్షించారు. ఇవాళ ఉదయం చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు వాగులో చిక్కుకున్నారు. కాసిపేట మండలం కోమటిచేను వద్ద సల్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చేపల వేటకు వాగులో యువకులు వాగులో దిగారు. ఒక్కసారి మత్తడి నుంచి ప్రవాహం పెరగడం వల్ల అక్కడే ఉన్న ఓ రాయిపైకి ఎక్కారు.  

వరద ప్రవాహం పెరగడం వల్ల సాయం కోసం యువకులు ఎదురుచూశారు. వాగు ప్రవాహం పెరిగితే యువకులు వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటం వల్ల అక్కడే ఉండిపోయారు. యువకులు వాగులో చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో యువకులను కాపాడారు.  

సంబంధిత కథనాలు:

Last Updated :Jul 22, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.