గట్టు రామచంద్రరావు తల్లికి మంత్రి హరీశ్‌ రావు నివాళులు

author img

By

Published : Jan 30, 2020, 8:35 PM IST

గట్టు రామచంద్రరావు తల్లికి మంత్రి హరీశ్‌ రావు నివాళులు

తెరాస రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు మాతృవియోగం చెందారు. ఇవాళ మహబూబాబాద్‌లోని సీతంపేటలో జరిగిన దశదిన కర్మకు మంత్రి హరీశ్‌రావు హాజరై నివాళులు అర్పించారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో ఇటీవల మరణించిన తెరాస రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు మాతృమూర్తి గట్టు సాయమ్మ దశదినకర్మకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. రామచంద్రరావును పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దశదిన కర్మకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ ఛైర్మన్లు కోరం కనకయ్య, బిందు హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గట్టు రామచంద్రరావు తల్లికి మంత్రి హరీశ్‌ రావు నివాళులు

ఇదీ చదవండి: నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!

TAGGED:

av
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.