Goods Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పునరుద్ధరణలో రైల్వే సిబ్బంది

author img

By

Published : Sep 27, 2021, 10:16 AM IST

Goods Train Derailed

విజయవాడ నుంచి బయలుదేరి భద్రాచలం వైపు వెళ్తున్న గూడ్స్​ రైలు పట్టాలు తప్పాయి (Goods Train Derailed). డోర్నకల్​ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే సిబ్బంది వర్షంలోనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది (Goods Train Derailed). పట్టాలు తప్పిన గూడ్స్ రైలులో 2 వ్యాగన్లు అదుపు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు.

వర్షంలోనే గూడ్స్‌ వ్యాగన్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గూడ్స్ రైలు ఏపీలోని విజయవాడ నుంచి భద్రాచలం వైపునకు వెళ్తోందని రైల్వే అధికారులు తెలిపారు. త్వరగా పునరుద్ధరణ చర్యలు తీసుకుని.. రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి: మౌలాలి: ఆగి ఉన్న రైలు బోగిలో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.