waiting for disability pension: దయలేని దేవుడు.. దయచూపండి మీరు..!

author img

By

Published : Nov 23, 2021, 7:24 PM IST

waiting for disability pension

శరీరంలో ఏ అవయవానికి కాస్త నొప్పి కలిగినా అల్లాడిపోతాం.. కాసేపు ఏదొక భాగం కదపలేని పరిస్థితి వస్తే... వెంటనే ఆస్పత్రికి పరుగెడతాం.. నోరు పలకకపోయి.. కాలు కదలకపోయి.. చెయ్యి ఆడకపోయి.. కన్ను చూడకపోయి.. శరీరం నిలబడలేకపోయి.. ఇలాంటి పదాలు చదువుతుంటేనే ఒళ్లు జలజరిస్తుంది కదూ.. అలాంటిది పుట్టి ఏళ్లు గడుస్తున్నా ఆ చిన్నారులు ఇలాంటి బాధలు పడుతున్నారంటే ఆ బిడ్డల కష్టం వర్ణనాతీతం.. వారి మాతృమూర్తుల వేదనకు లేదు ఉపసమనం. అలాంటి పరిస్థితిలో ఉన్న చిన్నారులు తమ కష్టాలను అధికారులకు వివరించి కాస్త సాయం చేయండని కోరుకోడానికి మహబూబాబాద్​ కలెక్టరేట్​కు (waiting for disability pension) వచ్చారు. మాట్లాడలేని ఆ బిడ్డల మనోవేదన.. అక్షర రూపం దాల్చుకుని అధికారుల ముందుకు ఇలా వస్తోంది.

దయలేని దేవుడు.. దయచూపండి మీరు..!

waiting for disability pension: కలెక్టర్​ గారు.. మేము అందరి పిల్లల మాదిరిగా లేము.. మా శరీరాలు దృఢంగా లేవు.. మా చేతివేళ్లు దేనిని పట్టుకోలేవు.. మా కాళ్లు అగుడు వేయలేవు.. కుర్చోబెట్టిన చోటునుంచి అడుగు దూరం కూడా నడవలేని దుస్థితి మాది.. ఊహతెలియని వయసులోనే జన్యుపరమైన లోపంతో మా శరీరంలో ఎదుగుదల లోపించింది. బక్కపలచని శరీరంతో మంచానికే పరిమితమ్యయ్యాం. ఏ పని చేసుకోవాలన్నా ఎవరో ఒకరి తోడు కావాల్సిందే.. కాసేపు అమ్మ ఒడిలో సేదదీరేది కూడా మందులు వేసుకోడానికి అనిపించే పరిస్థితి మాది. ఇళ్లు నడిపేందుకే అరకొరగా సరిపోయే నాన్న కూలి డబ్బులు.. నాకు కనీసం మందులు కొనడానికి చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అమ్మ పుస్తెలతాడుతో సహా తాకట్టు పెట్టి నన్ను బాగు చేయడానికి చేయని ప్రయత్నం లేదు.. నేను ఎందుకు ఇలా ఉన్నాను.. నేను చేసిన తప్పిందం ఏమిటో తెలియదు.. ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని తెలిసి ఎన్నో ఏళ్లుగా మా అమ్మానాన్న ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మీ దగ్గర కొస్తేనైనా పని జరుగుతుంది ఆశతో వచ్చాము.. మీరే మాపై దయచూపించి ఆదుకుంటారని మా విజ్ఞాపన..

ఇద్దరు చిన్నారులతో తల్లి  రమాదేవి
ఇద్దరు చిన్నారులతో తల్లి రమాదేవి

మంచానికే పరిమితమైన ఇద్దరు బిడ్డలు

డోర్నకల్​ మండలం ముల్కలపల్లికి చెదిన జక్కుల నగేశ్​ రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ముగ్గురు పిల్లలు ఉన్నా ఆ ఇంట ఏదో బాధ ఆవరించి ఉంది. పిల్లల అల్లరితో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మూడేళ్ల వ్యవధిలో జన్మించిన ఇద్దరు కుమార్తెలు పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన లోపంతో బాధపడుతున్నారు. శారీరకంగా ఎదుగుదల లేకపోవడం, కాళ్లూ చేతులు చచ్చుబడి సరిగా నిల్చోలేరు... కూర్చోలేని పరిస్థితి. మంచానికే పరిమితమైన వారిని నిత్యం కంటిపాపలా కాచుకుంటూ ఉండాల్సిందే.. పెద్దమ్మాయి గీతాలక్ష్మికి తొమ్మిదేళ్లు.. ఇప్పటికీ పొత్తిళ్లలో పాపాయిలా చూసుకోవాల్సిందే.. మూడేళ్ల తేడాతో జన్మించిన మరో అమ్మాయి నోవికాది కూడా అదే పరిస్థితి. ఆమె కాళ్లు, చేతులు కదల్చలేదు. చిన్నారులిద్దరినీ హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చూపించగా.. జన్యుపరమైన లోపమని వైద్యులు నిర్ధరించారు. వారికి నిత్యం మందులు వాడాల్సిందే.. ఇప్పటికే వారి వైద్యం కోసం అన్నీ అమ్ముకుని సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చుచేశారు. ఇక అమ్మడానికి కూడా వారి వద్ద ఏమీలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు తల్లిదండ్రులు. సదరం ధ్రువపత్రం ఉన్నప్పటికీ ఇప్పటీకీ ఎటువంటి ఫించన్​ రావడంలేదని వాపోతున్నారు.

తల్లి ఒడిలో రక్షిత్​..
తల్లి ఒడిలో రక్షిత్​..

పుట్టినప్పుడు 4కిలోలు.. ఆరేళ్లకు 8కిలోలు

తల్లిఒడిలో బక్కపలచని శరీరాకృతితో దీనంగా చూస్తున్న ఈ చిన్నారి చిమ్మట రక్షిత్​. బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన కుమారస్వామి, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు. ఆరేళ్ల వయసున్న రక్షిత్​.. పుట్టినప్పుడు నాలుగు కిలోల బరువుతో జన్మించాడు.. ఆరు నెలల పాటు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఎదుగుదల లోపించి ఇలా మారిపోతూ వచ్చాడు. హైదరాబాద్​తో పాటు ఏపీలోని పలు ఫ్రముఖ ఆస్పత్రుల్లో చూపించారు. ఎక్కడికి వెళ్లినా జన్యుపరమైన లోపమన వైద్యులు నిర్ధరించారు. ఎన్ని మందులు వాడిని ఎటువంటి ఫలితం లేదు. పుట్టినప్పుడే నాలుగు కిలోల బరువుతో పుట్టిన రక్షిత్​.. ఆరేళ్లు వచ్చినా ఎనిమిది కిలోల బరువే ఉన్నాడు. కనీసం మలం రావాలన్నా మందులు వేయాల్సిందే.. మందుల కోసమే నెలకు రూ.5వేలు ఖర్చుచేస్తున్నారు తల్లిదండ్రులు. ఏడాదిలో రెండుసార్లు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూలో ఉంచి ఆక్సిజన్​ అందిస్తున్నారు. మూడేళ్ల క్రితమే సదరం ధ్రువపత్రం వచ్చినా..ఇప్పటికీ పింఛన్​ మంజూరుకాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ బిడ్డకు పింఛన్​ ఇప్పించాలని కోరుతున్నారు.

waiting for disability pension
waiting for disability pension

కాస్త దయచూపండి..

ఈ రెండు కుటుంబాలు రెక్కల కష్టం మీద ఆదారపడి బతుకున్నావారే.. బిడ్డలను ఈ స్థితిలో చూడలేక.. ఉన్నవన్నీ అమ్ముకున్నారు. కూలికెళితేగాని పూటగడవని పరిస్థితి. సదరం ధ్రువపత్రం ఉన్నా.. పింఛన్​ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా అందని పరిస్థితి.. ఎందరి చుట్టూ తిరిగినా పని జరగకపోవడంతో.. జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్​లో వికలాంగుల పింఛన్​ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్ల తరబడిగా అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్‌ సైతం అందక...వైద్యం కోసం అప్పుల ఊబిలో కూరుతున్నారు. ప్రభుత్వంతో పాటు దాతల సాయం కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చూడండి: KTR Help: 'రిజ్వానా' కేటీఆర్​ను కదిలించింది? ఎవరీ రిజ్వానా? కేటీఆర్ ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.