రహదారి బాగోలేక.. మూడు కిలోమీటర్లు బాలింత నడక

author img

By

Published : Aug 27, 2021, 10:10 AM IST

Updated : Aug 27, 2021, 10:52 AM IST

balintha

ఏటా బడ్జెట్​లో వేల కోట్ల కేటాయింపులు.. గ్రామీణ ప్రాంతాల్లోని కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరచలేకపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లోని గ్రామాల్లో ఎంత అత్యవసరమైనా కాలినడకనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటోంది. రహదారి సరిగ్గా లేక.. ఓ బాలింత ఏకంగా మూడు కిలోమీటర్ల నడిచి ఇంటికి చేరిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకొంది.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమికి ఈ ఘటన సజీవ సాక్ష్యం. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్​ సైతం రాలేక.. ఓ బాలింత ఏకంగా మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని ముర్లిగూడలో గురువారం చోటుచేసుకొంది.

ముర్లిగూడకు చెందిన పొరెట్టి కవితకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కాగజ్​నగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం.. ఆస్పత్రి నుంచి 102 అంబులెన్సులో ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో కమ్మర్గాం వరకు మాత్రమే అంబులెన్సు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వారు డబ్బులు డిమాండ్​ చేసినట్లు ఆరోపించారు.

అక్కడి నుంచి సుమారు మూడు కి.మీ. బాలింతను నడిపించుకుంటూ కుటుంబ సభ్యులు ముర్లిగూడకు తీసుకెళ్లారు. ఆ దారంతా రాళ్లతో ఉందని... ఇంటికి చేరేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చిందని బాలింత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అత్యవసర సమయాల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదని ముర్లిగూడ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారిని మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.

రహదారి బాగోలేక.. మూడు కిలోమీటర్లు బాలింత నడక

ఇదీచూడండి: అమ్మాయిలు.. అలసటగా ఉంటోందా?

Last Updated :Aug 27, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.