నిరంతరం అభివృద్దిని కాంక్షించే తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని.. బొట్టుబిల్లలు, కుట్టుమిషన్లకు ఆశపడవద్దని ఆర్ధికశాఖమంత్రి హరీశ్ రావు కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విశ్వబ్రాహ్మాణ కమ్యూనిటీ హాల్ను మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
విశ్వబ్రాహ్మణులకు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి సహకారం అందించలేదని హరీశ్రావు పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అన్ని కులాలు, వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన భవనాన్ని మరింత విస్తరించుకోవడానికి... మరిన్ని నిధులు అవసరమైతే ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధిని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచే గెల్లుశ్రీనివాస్ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో తెరాస గెలుస్తుందనే నమ్మకం కలిగిందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Saidabad Incident: రైల్వేట్రాక్పై సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం