Huzurabad by election: హుజూరాబాద్​ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

author img

By

Published : Sep 4, 2021, 1:20 PM IST

Updated : Sep 4, 2021, 2:13 PM IST

Huzurabad by election

13:19 September 04

దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉపఎన్నిక: ఈసీ

రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని సీఈసీని తెలుగు రాష్ట్రాల సీఎస్​లు కోరారని వెల్లడించింది. ఈ నెల 1న 12 రాష్ట్రాల సీఎస్​లతో సమావేశమైన సీఈసీ.. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబరు లేదా నవంబరులో హుజూరాబాద్ ఉపఎన్నిక ఉండనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది.

హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ జూన్​లో రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఇప్పటికే తెరాస, భాజపా, కాంగ్రెస్​ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. తెరాస నుంచి రాజీనామా చేసిన ఈటల రాజేందర్​ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. జి.శ్రీనివాస్​ యాదవ్​ పేరును తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్​ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది.

Last Updated :Sep 4, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.