corona vaccination: ఉపసర్పంచ్​ చొరవ.. 'ఇంటి వద్దకే కరోనా టీకా' కార్యక్రమం

author img

By

Published : Sep 22, 2021, 5:47 AM IST

corona vaccination

తమ పంచాయతీని వంద శాతం కరోనా ఫ్రీగా నిలపాలనుకున్నారు.. ఆ ఊరి ఉపసర్పంచ్​. ఇప్పటి వరకూ వ్యాక్సిన్​ తీసుకోని వారిని గుర్తించి.. ఇంటి వద్దకే టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా వంద శాతం వ్యాక్సినేషన్​ పంచాయతీగా రికార్డుకెక్కింది.. కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న దుర్శేడు.

కరీంనగర్ జిల్లాలో ఓ పంచాయతీ పాలకవర్గం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించి.. ఇంటి వద్దకే వెళ్లి టీకా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో వ్యాక్సినేషన్​పై విస్తృత అవగాహన కల్పించి వంద శాతం కరోనా వాక్సినేషన్​ గ్రామంగా రికార్డు సృష్టించింది.

కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న దుర్శేడు గ్రామంలో కొంతమందికి వ్యాక్సిన్ అంటే భయం మాత్రం పోలేదు. దీనిపై గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్​రావు దృష్టిసారించారు. ఇప్పటికే పలుమార్లు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినా.. వందశాతం పూర్తికాలేదు. ఎలాగైనా గ్రామంలో వంద శాతం టీకా తీసుకొనే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇంటి వద్దకే వ్యాక్సిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందుకోసం తొలుత గ్రామంలో... ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేసుకోని వారి వివరాలను తీసుకున్నారు. వారికి వ్యాక్సిన్​ పట్ల అవగాహన కల్పించారు. ఇలా సుమారు 3000 వేల మంది ఉన్నట్లు గుర్తించి.. వారి ఇళ్లకు సమీపంలోనే వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటుచేసేలా చొరవ తీసుకున్నారు. డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో... వారందరికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

గ్రామంలో వంద శాతం కరోనా ఫ్రీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు.. ఉపసర్పంచ్​ సుంకిశాల సంపత్​రావు. ఇంజక్షన్​ అంటే కొందరికి భయం సహజమేనని.. అలాంటి వారు సహా అవగాహన లోపంతో కొంతమంది టీకా వేసుకొనేందుకు భయపడుతున్నారని గుర్తించి.. వ్యాక్సిన్​ వేసుకొనేలా ప్రోత్సహించమన్నారు.

తొలుత ఇక్కడి ప్రజలు వ్యాక్సినేషన్​ పట్ల ఆసక్తి చూపించలేదని.. డాక్టర్​ శిరిష్​ తెలిపారు. పంచాయతీ పాలకవర్గం సహకారంతోనే వంద శాతం పూర్తిచేశామన్నారు.

ఇదీచూడండి: ఆ భాజపా నేతకు 5 డోసుల వ్యాక్సిన్​.. ఆరో డోసుకు షెడ్యూల్​ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.