huzurabad election: 'ఈటల గెలిస్తే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారా?'

author img

By

Published : Oct 3, 2021, 3:42 PM IST

Updated : Oct 3, 2021, 4:25 PM IST

bandi sanjay speech in huzurabad by elections campaign

హుజూరాబాద్​లో భాజపా నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అభ్యర్థి ఈటల రాజేందర్​తో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు. కార్యకర్తలకు బండి సంజయ్​ దిశానిర్దేశం చేశారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఈటల రాజేందర్​ను గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు.

'ఈటల గెలిస్తే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారా?'

హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో తెరాస బరితెగింపు రాజకీయాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. బరి గీసి ధర్మం కోసం భాజపా పోరాడుతోందని స్పష్టం చేశారు. హుజూరాబాద్​లో భాజపా ఎన్నికల శంఖారావం సభలో అభ్యర్థి ఈటల రాజేందర్​తో పాటు బండి సంజయ్​ పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ గ్రామంలో గల్లీగల్లీ తిరుగుతూ గడపగడపకు వెళ్లి.. ఈటల రాజేందర్​ను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు.

కరెన్సీ నోటుకు కమలం పువ్వుకు మధ్య పోరాటం జరుగుతోందని బండిసంజయ్​ తెలిపారు. ఈ సంగ్రామంలో కమలం పువ్వుదే విజయమని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్​లో ఉద్యమస్ఫూర్తిని నింపిన ఉద్యమకారుడు, నాయకుడు ఈటల రాజేందర్​ను గెలిపించి.. కమలం పువ్వును వికసింపజేయాలని సూచించారు. త్వరలోనే అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

డిపాజిట్లు కూడా రావు..

"ఉద్యమ సమయంలో కేసీఆర్​ ఎప్పుడు దొంగ దీక్షలే చేసిండు. అబద్దాలు, మాయమాటలు, పిట్టకథలు చెప్పటం కేసీఆర్​ను వెన్నతో పెట్టిన విద్య. అదే విద్యను తెరాసలోని అందరు నాయకులు అలవర్చుకున్నారు. నిజమైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్​. హుజూరాబాద్​ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని ఈటల నింపారు. అలాంటి నాయకున్ని మనమే గెలింపించుకోవాలి. ఆ బాధ్యత కార్యకర్తలదే. ప్రతీ గ్రామానికి వెళ్లాలి. గల్లీగల్లీ తిరగాలి. గడపగడపకు వెళ్లి.. ఈటల రాజేందర్​ స్ఫూర్తిని తెలిజేయాలి. భాజపా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తోందో వివరించాలి. ఈ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. తెరాస పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయి. ఒక్కో ఓటుకు పది వేల చొప్పున డబ్బులు పంచుతున్నారు. ఎన్ని పైసలిచ్చినా తీసుకోండ్రి. అడ్డుకోకండి. ఎన్నిస్తే అన్ని తీసుకుని.. ఓటు మాత్రం భాజపాకే వెయ్యాలి. ఒకవేల హుజూరాబాద్​లో తెరాస గెలవకపోతే.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా..? తెరాస పార్టీకి కేసీఆర్​ కుటుంబమే ఓ శని. ఇది నా సవాలు. తెరాస నాయకులు అవాక్కులు, చెవాక్కులు పేలితే.. మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈటలను గెలిపించాల్సిన బాధ్యత మీదే." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

తెరాసకు గుణపాఠం..

పేద ప్రజల పక్షాన జీవితాంతం నిలబడతానని హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ.. తనపై తెరాస దుష్ప్రచారం చేస్తోందని ఈటల రాజేందర్​ ఆరోపించారు. తెరాస కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈటల ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

Last Updated :Oct 3, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.