ఊరు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగివ్వకపోతే లావైపోతా..!

author img

By

Published : Oct 12, 2021, 7:42 AM IST

ఊరు చాలా ఇచ్చింది..

శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్.. చాలా ఇచ్చింది నాకు మా ఊరు.. ఎంతో కొంత తిరిగియ్యాలి.. లేకపోతే లావైపోతా అంటూ ఓ డైలాగ్ చెబుతుంది. తను పుట్టిన ఊరు.. తనని పెంచిన మనుషులకు ఎంతో కొంత తిరికి చేయాలని తపిస్తూంటుంది. అచ్చం అలాగే భావించాడు కామారెడ్డి జిల్లాలోనూ ఓ వ్యక్తి. హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి బాగా సంపాదించాడు. తను పుట్టిన పెరిగిన మట్టికి ఏదైనా చేయాలనుకున్నాడు. ఇంతకీ అతను తన గ్రామానికి ఏం చేశాడు? శ్రుతిహాసన్​లాగా రోడ్లు వేయించాలనుకున్నాడా? మహేశ్ బాబులాగా స్కూల్ కట్టించాడా?

ఉన్నత స్థానంలో స్థిరపడగానే..పుట్టిన ఊరిని మరిచిపోతున్న వారెందరో. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి అందుకు భిన్నం. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో స్థిరపడిన ఆయన.. స్వగ్రామంలోనూ మెట్రో నగరాలకు మల్లే సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు. సుమారు రూ.4.50 కోట్లు వెచ్చించి 6.5 కి.మీ.ల మేర భూగర్భ మురుగు కాలువలు నిర్మించాలని నిర్ణయించారు.

ఈ మేరకు సర్పంచి పాత రాజు ఆధ్వర్యంలో సోమవారం పనులు ప్రారంభించారు. తాను చదివిన ప్రాథమిక పాఠశాల గతేడాది కురిసిన వర్షాలకు కూలిపోయిందని స్థానికుల ద్వారా తెలుసుకుని రూ.78 లక్షల వ్యయంతో 8 గదులతో భవనం సిద్ధం చేయించారు. ప్రస్తుతం అక్కడే తరగతులు జరుగుతున్నాయి. ‘‘వేణుగోపాల్‌రెడ్డి.. తమ గ్రామంలో 120 మంది పేదలకు గతంలో మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారని, రూ.35 లక్షలతో ఎనిమిది పడకలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించేందుకు తాజాగా అంగీకరించారని’ సర్పంచ్ తెలిపారు.

ఊరికి ఉపకారం..!
వేణుగోపాల్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.