కొవిడ్​తో మృతిచెందిన అనుచరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

author img

By

Published : May 19, 2021, 12:28 PM IST

Telangana news

కొవిడ్​ మృతునికి అంత్యక్రియలు నిర్వహించి బాధిత కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని కల్పించారు... స్టేషన్ ఘన​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కొవిడ్​ కట్టడికి సాయపడాలని సూచించారు.

కొవిడ్​తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొని.... ఎమ్మెల్యే రాజయ్య బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలోని జఫర్​గఢ్ మండలం కునూరుకు చెందిన... ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్ చౌదరి మల్లయ్య కొవిడ్​తో పోరాడుతూ హైదరాబాద్​లోని ఆస్పత్రిలో మృతి చెందారు.

స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. కొవిడ్​కు మనోధైర్యాన్ని మించిన మందు లేదని... స్వీయ నిర్బంధమే రక్షణ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మల్లయ్య మృతితో రాజకీయంగా మంచి అనుచరుడిని కోల్పోయానని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. కొవిడ్​ మృతుల అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించడంతో పాటుగా... మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపేందుకు దహన సంస్కారాలకు హజరయ్యానని రాజయ్య తెలిపారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.