కొవిడ్​ బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలి: ఎర్రబెల్లి

author img

By

Published : May 30, 2021, 4:57 PM IST

errabelli

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

కొవిడ్​ బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల వైరస్​ తీవ్రత తగ్గుతోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్​ అందించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని.. వైరస్​ను తరిమికొట్టాలని పేర్కొన్నారు. కొవిడ్​ బాధితుల్లో ప్రజాప్రతినిధులు మనోధైర్యాన్ని నింపాలని తెలిపారు.

ఇదీ చూడండి: Yadadri: యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎంఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.