Bandi sanjay padayatra ధనిక రాష్ట్రమైతే జీతాలు ఎందుకిస్తలేవన్న బండి సంజయ్

author img

By

Published : Aug 18, 2022, 3:22 PM IST

Bandi sanjay padayatra

Bandi sanjay padayatra భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర బండి సంజయ్ హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం అర్చకసంఘం నేతలతో సమావేశమైన బండి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు.

Bandi sanjay padayatra: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ వేద పాఠశాల ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలోని బ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం, నెల్లుట్ల నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. జనగాం టౌన్, నెహ్రూ పార్క్, ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా రెడ్డి సంఘం వరకు కొనసాగనుంది.

తెలంగాణ ఆర్థికంగా ధనిక రాష్ట్రమట. మరీ జీతాలు ఎందుకిస్తలేవ్. ధూప దీప నైవేద్యాలు స్కీమ్​పై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నువ్విచ్చే ఆరు వేలు ఎందుకు సరిపోతాయి. హారతి, కర్పూరం పాకెట్ రేటు ఎంత? మీ వీఐపీలు వస్తేనే ఖర్చయితాయ్ - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ప్రతి జిల్లాలో వేద పాఠశాల కోసం తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, మీ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్నానని వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అర్చకులకు రూ.6 వేలు ఇవ్వడానికే కేసీఆర్​కు దిక్కు లేదా అని నిలదీశారు. పాదయాత్రలో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

Bandi sanjay padayatra

ఇవీ చదవండి:

సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీచ్​లో అనుమానిత బోటు, ఏకే47 ఆయుధం, అసలేమైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.