RS PRAVEEN KUMAR: 'బహుజనుల రాజ్యం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలి'

author img

By

Published : Sep 27, 2021, 8:54 AM IST

rs praveen kumar

ఈటల రాజేందర్​ను ఓడించేందుకు కోట్లు ఖర్చుచేస్తున్నారని.. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. పల్లెవనాలు, రైతు వేదికలు, కలెక్టరేట్ల పేరుమీద వేలాది ఎకరాల భూమి గుంజుకుంటున్నారని మండిపడ్డారు.

1978లో భూమి కోసం పోరాటం చేసిన జగిత్యాల యాత్ర స్ఫూర్తితో.. ఈ జగిత్యాల గడ్డమీది నుంచి ప్రగతిభవన్​కు వెళ్దామని.. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ స్పష్టం చేశారు. కార్యకర్తలంతా పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. జగిత్యాల మినీ స్టేడియంలో.. 'జగిత్యాల బహుజన జైత్ర' బహిరంగ సభలో ప్రవీణ్​కుమార్​ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి బీఎస్పీ కార్యకర్తలు తరలి వచ్చారు.

పల్లల ప్రకృతి వనాలు, రైతువేదికలు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు, ఇండస్ట్రీయల్ పార్టీల​ పేరుమీద వేలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు గుంజుకొని.. రోడ్డుమీదకు నెట్టిన పాలకుల కోసం మాట్లాడుకోవాలని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. బిడ్డ.. పాతరోజులుపోయినయ్​.. ఇవాళ బహుజన బిడ్డలు గజరాజును ఎక్కివచ్చారన్నారు. తనకు జరిగన అన్యాయంపై బరాబర్​ మాట్లాడుతామని స్పష్టం చేశారు.

RS PRAVEEN KUMAR: 'బహుజనుల రాజ్యం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలి'

'పల్లెవనాలు, రైతు వేదికలు, కలెక్టరేట్ల పేరుమీద వేలాది ఎకరాల భూమి గుంజుకున్నారు. ముదిరాజ్​ల బిడ్డ ఈటల రాజేందర్​ను సతాయించి పంపించారు. ఇవాళ ఆయన ఓడినా.. గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. అయినా కక్షగట్టి ఆయనను ఓడించాలని.. వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు.'

- ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డీనేటర్​.

ఇవీచూడండి: నేడు భారత్ బంద్​- అప్రమత్తమైన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.