భక్తులకు గుడ్​న్యూస్​.. వసంత పంచమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

author img

By

Published : Jan 24, 2023, 6:03 PM IST

TSRTC special buses

TSRTC special buses for Vasantha Panchami: వసంత పంచమి సందర్భంగా భక్తులు రద్ధీని దృష్టిలో ఉంచుకొని టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 26న నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌ సైట్‌ను సందర్శించాలని ఆయన కోరారు.

TSRTC special buses for Vasantha Panchami: ఈ నెల 26వ తేదీన వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వసంత పంచమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం 108 బస్సులను ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 బస్సులను ప్రత్యేకంగా బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయని వివరించారు.

బాసరకు వెళ్లే బస్సులు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ నుంచి 21, జేబీఎస్‌ నుంచి 12, నిజామాబాద్‌ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్‌ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వర్గల్‌కు సికింద్రాబాద్‌(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా చర్యులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి 10, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నామని వివరించారు.

భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్​లను ఉపయోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని భక్తులకు సూచించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌ సైట్‌ www.tsrtconline.in ను సందర్శించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.